అమర్‌ - తేజస్వీ, నిరుపమ్ - మంజుల, జాకీ - హరిత, సిద్దార్ద్ - విష్ణు ప్రియా, సీరియల్ కలిపిన బంధం, ప్రేమ పెళ్లి

First Published Nov 26, 2023, 12:37 PM IST

ఎన్నెన్నో జన్మల బంధం ఎక్కడో ఒక చోట కలుస్తుంది అంటారు పెద్దలు. అది నిజమా కాదా తెలియదు కాని.. కెరీర్ కోసం సినిమాలు, సీరియల్స్ లోకి వచ్చిన తారలు అక్కడ తమ మనసుకు నచ్చి... వారిని మెచ్చిన పార్ట్నర్ ను వెతుక్కుని పెళ్లిల్లు చేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న సీరియల్ నటులు ఎవరో చూద్దాం. 
 

ప్రేమ పెళ్ళి చేసుకున్న సీరియల్ నటీనటులలో రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు అమర్ దీప్ చౌదరి- తేజస్వీనీ గౌడ. ఉయ్యాలా జంపాల సీరియల్ తో తెలుగు  టెలివిజన్ ఆడియన్స్ కి పరిచయమయ్యాడు  అమర్ దీప్. ఈసీరియల్ లో  సెకండ్ హీరోగా మెరిసాడు. ఆతరువాత సిరిసిరి మువ్వలు సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, తమిళంలో సీరియల్స్ తో బిజీగా ఉన్న తేజస్విని గౌడ ను ప్రేమిచి రీసెంట్ గా పెళ్ళాడాడు. కోయిలమ్మ  సీరియల్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన తేజస్వీ.. అటు తమిళ్ లో కూడా  మంచి గుర్తింపు పొందింది. ఇక అమర్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఉన్నాడు. టాప్ 5లో అతనుపక్కా.. రన్నర్ గా కూడా అతని పేరే వినిపిస్తుంది. 
 

ఇక అమర్ తో పాటు జానకికలగనలేదుసీరియల్ లో నటిస్తోంది ప్రియాంక జైన్. ఈ బ్యూటీ మొదటి సీరియల్ మౌనరాగం. ఈసీరియల్ లో మూగ అమ్మాయిగా నటించి మెప్పించింది బ్యూటీ. మౌనరాగంలో హీరోగా నటించి శివకుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. త్వరలో శివనుపెల్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బస్ తెలుగు సీజన్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉంది ప్రియాంక. 
 

Latest Videos


సిద్ధార్థ వర్మ..విష్ణు ప్రియా.. ఈ ఇద్దరు సీరియల్ స్టార్స్..తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకున్నతారలు.  త్రినయని, కుంకుమపువ్వు,ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ బుల్లితెర నటి విష్ణు ప్రియను ఎంతో  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా. 
 

ఇక ప్రేమపెళ్ళి చేసుకున్న మరోజంట నిరుపమ్ పరిటాల మరియు మంజుల. కన్నడ నటి  మంజుల నిరుపమ్ తో కలిసి చంద్రముఖి సీరియల్‌లో కలిసి నటించింది. చాలాకాలం ఈసీరియల్ లో వీరి జర్నీ కొనసాగింది. అయితే సీరియల్ అయిపోయే నాటికి వీరి పెళ్ళి అయ్యింది.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

అటుసినిమాలు.. ఇటుసీరియల్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ వచ్చిన సుహాసిని  గుర్తుండే ఉంటుంది. ఆమె తన తోటి నటుడు ధర్మను  ప్రేమించి పెళ్ళాడింది. అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్,వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కల్సి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని పెళ్లాడింది.

ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన మనసు మమత సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకుల కు దగ్గర అయ్యాడు.  చంద్రముఖి క్యారక్ట్ ర్ తో అందరిని మెప్పించిన మానస. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో అనే సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియతమ్ చరణ్,మానస ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు.
 

సీరియల్ కలిపిన బంధంలో సీనియర్ జంట జాకీ- హరిత. హీరోయిన్ రవళి చెల్లెలు అయిన హరిత కొన్నిసినిమాల్లో కూడా నటించింది. ఇక అప్పటికే సినిమాల్లో బాగా ఫేమస్ అయిన జాకీ ఇద్దరు ఒక ప్రోగ్రామ్ లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆతరువాత టెలివిజన్ లోకి అడుగు పెట్టి.. వైదేహి, సంఘర్షణ, కలవారి కోడలు,మనసు తదితర సీరియల్స్ లో కల్సి నటించిన హరిత,జాకీ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

ఇక సీరియల్ కలిపిన బంధంలో మరో సీనియర్ జంట ఇంద్రనీల్ మరియు మేఘన. తెలుగువారు మెచ్చిన చక్రవాకం సీరియల్ లో నటించారు ఈ ఇద్దరు. ఆసీరియల్ నడుస్తుండగానే ప్రేమించకుని ఇద్దరు ఓ ఇంటివారు అయ్యారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

వీరే కాదు.. యాంకర్లు గా రాణిస్తున్న సుమ కనకాల -రాజీవ్ కనకాల,  శ్యామలా-నరసింహరెడ్డి,  ప్రియాంక నాయుడు, మధుబాబు, ఇలా చాలామంది తారలు సీరియల్స్ లో కి వచ్చి తమ లక్ ను పరీక్షించుకోవడంతో పాటు.. లక్కీగ పార్ట్ నర్స్ ను సెలక్ట్ చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 

click me!