అల్లు శిరీష్‌ సంచలన నిర్ణయం.. ఆడియెన్స్ కి అదిరిపోయే ఆఫర్‌.. సక్సెస్‌ కోసం సాహసం..

Published : Jul 29, 2024, 11:39 PM IST

అల్లు శిరీష్‌ తన సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆడియెన్స్ కి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
14
అల్లు శిరీష్‌ సంచలన నిర్ణయం.. ఆడియెన్స్ కి అదిరిపోయే ఆఫర్‌.. సక్సెస్‌ కోసం సాహసం..

అల్లు అర్జున్‌ తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ సరైన బ్రేక్ కోసం చాలా ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నాడు. ఆయన సినిమాలు కొన్ని ఫర్వాలేదనిపించినా చాలా వరకు నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్‌ చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. సక్సెస్‌ కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం `బడ్డీ` అనే చిత్రంలో నటిస్తున్నాడు. టెడ్డీ బేర్‌ ప్రధానంగా సాగే థ్రిల్లర్‌ మూవీ ఇది. యాక్షన్‌, లవ్, రొమాన్స్, కామెడీ మేళవింపుగా తెరకెక్కించారు. శామ్‌ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా రాజేష్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

24

అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా టీమ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అల్లు శిరీష్‌ పెద్ద సాహసమే చేస్తున్నాడు. సక్సెస్‌ కోసం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాని ఆడియెన్స్ చూడాలనే ఉద్దేశ్యంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 
 

34
Buddy

`బడ్డీ` సినిమా టికెట్‌ రేట్లని తగ్గించారు. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుతారు. మామూలు సినిమాలకు ఉన్న రేట్లతో ప్రదర్శిస్తారు. కానీ అల్లు శిరీష్‌ టీమ్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆడియెన్స్ కి ఆఫర్‌ని ప్రకటించారు. టికెట్‌ రేట్లని తగ్గించారు. సింగిల్ స్క్రిన్స్ లో 99 రూపాయలకే టికెట్‌ని ఇస్తుంది. అలాగే మల్టీఫ్లెక్స్‌ ల్లో కేవలం రూ.125కే టికెట్లని విక్రయిస్తుంది. దీని ప్రకారం ఆల్మోస్ట్ సగానికి పైగా టికెట్‌ రేట్లని తగ్గించడం విశేషం. 
 

44

తమ సినిమా ఎక్కువ మందికి రీచ్‌ కావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీమ్‌ తెలిపింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా "బడ్డీ" సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ అందించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఛాట్ బస్టర్స్ అయ్యాయి. "బడ్డీ" సినిమా ట్రైలర్ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న "బడ్డీ" సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే ఆశాభావంతో ఉంది టీమ్‌. మరి ఈ సారైనా అల్లు శిరీష్‌కి బ్రేక్ వస్తుందా అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories