మణిరత్నం దర్శకత్వంలో కార్తి, విక్రమ్, జయంరవి, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ కాస్టింగ్తో రూపొందిన చిత్రం `పొన్నియిన్ సెల్వన్`.ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఆధారంగా ఛోళరాజుల కాలం నాటి కథతో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుస పరాజయాలతో ఉన్న మణిరత్నం తానేంటో నిరూపించుకోబోతున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్తో విజువల్ వండర్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కాబోతుంది. దీన్ని దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.