ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` సక్సెస్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1900కోట్లు వసూలు చేసినా దాన్ని సంతోషించే పరిస్థితి, ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకునే పరిస్థితి లేదు.
`పుష్ప 2` రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం, వాళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటమే కారణమని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇది కేసు అయి పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే కాదు, జైల్లో కూడా గడిపేలా చేసింది.