ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖులు..
ఈ నేపథ్యంలో, ఆయన గుర్తింపును ఉపయోగించి ఏఐ ఆధారిత డీప్ఫేక్ వీడియోలు, ఫేస్ మార్ఫింగ్ కంటెంట్ సృష్టించడాన్ని నిషేధించింది. అలాగే ఆయన ఫొటోలతో దుస్తులు, పోస్టర్లు వంటి వస్తువులను విక్రయించకూడదని ఆదేశించింది. అభ్యంతరకరమైన కంటెంట్ కలిగిన లింకులు, వెబ్సైట్లను 72 గంటల్లోగా తొలగించాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణలను జులై 14 , సెప్టెంబర్ 24 తేదీలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు పలువురు ప్రముఖులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారిలో పవన్ కళ్యాణ్, నాగార్జున, కాజోల్, ఐశ్వర్య రాయ్, చిరంజీవి, వంటి సెలబ్రిటీలు ఉన్నారు.