క్రేజీ రూమర్...మహేష్ బాబు ‌- త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ, కీలకపాత్రలో అల్లు అర్జున్ కూతురు...?

First Published Jan 4, 2023, 12:26 PM IST

టాలీవుడ్ లో ఈ మధ్య క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. ఎవరూ ఊహించని కాంబోలు ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబో ఒకటి సెట్ అయినట్టు తెలుస్తోంది. 
 

సూపర్ స్టార్ మహేష్ బాబు ‌‌- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల సెంకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈమూవీలో మరో కీలక పాత్రతో అల్లు అర్హ  కూడా కనిపించబోతున్నట్టు సమాచారం. 

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచీ.. వరుసగా ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నారు టీమ్. ఈ సమ్మర్ లో..  మే నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుననారు. 

అయితే ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఏదొ ఒక క్రేజీ న్యూస్ బయటకువస్తూనే ఉంది. ఈక్రమంలోలే మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్ట వైరల్ అవుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ గారాల పట్టి.. అల్లు అర్హ కీలక పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా  ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే ఈ బుల్లి స్టార్ ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అలవైకుంఠపురములో సినిమాలో గెస్ట్ రోల్ తో   స్టార్ట్ చేసి.. రీసెంట్ గా  గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమాతో ఫుల్ టైమ్ యాక్ట్రస్ గా.. అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాలో భరతుని పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది. 

Allu Arha Allu Arjun

ఇక  మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఒక పాత్ర కోసం మేకర్స్ అర్హ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బంధం గురించి అందరికి తెలిసిందే.. ఆ చనువుతోనే త్రివిక్రమ్ అడిగిన వెంటనే బన్నీ వెంటనే ఈ సినిమాకు ఒప్పేసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈమూవీలో అల్లు అర్హ  పెర్ఫామెన్స్  చూసి.. ఆమె కోసం అవకాశాల బన్నీ ఇంటి తలపు తడతాయంటున్నారు సినీ జనాలు. ఈ లెక్కన చిన్నతనం నుంచే బన్నీని మించిన స్టార్ అవుతుందంటున్నారు. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో  గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ ఇద్దరియూ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

click me!