మారిపోయిన రెమ్యునరేషన్ ట్రెండ్
కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీలో పారితోషికాల ట్రెండ్ బాగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ను భారీగా పెంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా దక్షిణాది నటులు రెమ్యుూనరేషన్ విషయంలో ముందున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు విజయ్, రజినీకాంత్ లాంటి వారు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ లిస్టులో కొత్తగా టాలీవుడ్ స్టార్ హీరో చేరడంతో పాటు వాళ్లను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.