Itlu Maredumilli Prajaneekam Review : అల్లరి నరేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ!

First Published Nov 25, 2022, 2:23 PM IST

టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ (Allari Naresh) తాజాగా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం  ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
 

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ‘Itlu Maredumilli Prajaneekam’. ఏఆర్ మోహన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈరోజు (నవంబర్ 25)న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చివరిగా ‘నాంది’తో ప్రేక్షకులను అలరించిన నరేశ్ ఈసారి ఎన్నికల నేపథ్యంలోని కాస్తా సీరియస్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరీ ఈ సినిమాతో నరేశ్ మెప్పించాడా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం..

కథ : తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్(అల్లరి నరేష్) ఎన్నికల అధికారిగా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వెళ్తారు. నలుగురికి సాయం చేసే గుణం, అవినీతిని అడ్డుకోవాలనే తత్వం ఉన్న వ్యక్తి శ్రీనివాస్. దీంతో ఎన్నికల నిర్వహణలో భాగంగా మారేడుమిల్లికి వెళ్లిన అల్లరి నరేశ్ అక్కడ దిగిన తర్వాత కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల దయనీయ పరిస్థితిని తెలుసుకుంటాడు. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అందుకని వారిని ఓటు వేయించడానికి నిరాకరిస్తాడు. అందుకు తగ్గట్టుగానే ఓ ప్రణాళికను రూపొందించి.. మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి పోరాటంలో చేరుతాడు. ఈ క్రమంలో ప్రభుత్వంతో పారాడి ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడనేది మిగతా సినిమా..
 

విశ్లేషణ : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రోటీన్ స్టోరీ. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కొత్తదనమేమీ లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పొలిటీషన్స్, ప్రభుత్వ ఆఫీసర్లకు ప్రజలు గుర్తుకు వస్తారని.. ఆ తర్వాత పట్టించుకునే నాథుడే ఉండడనేది మెయిన్ ప్లాట్ గా అర్థం అవుతోంది. సినిమా మొత్తం ఈ అంశంపైనే నడుస్తుంది. కథ సాగిన తీరుకూడా పెద్దగా ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. ఒకసన్నివేశం చూస్తే ఆ తర్వాతి వచ్చే సీన్లను ఈజీగానే ఊహించే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే సినిమా అంతంఎలా ఉంటుందో చెప్పేయోచ్చు. పేదలు వైద్యం కోసం వాగులు, వంకలు దాటుకొని పోవాల్సి వచ్చిన సన్నివేశాలను  నిత్యం మనం న్యూస్ లోచూసేలానే ఉన్నాయి. వీటిని కొత్తగా చూపించే ప్రయత్నమూ చేయలేదు.  గిరిజనుల సమస్యలకు సంబంధించి ఎమోషన్స్ పండలేదు. దీంతో ఆయ సీన్లు తేలిపోయాయి. 
 

చిత్రంలోని పాత్రలు, కథ సాధారణంగానే ఉన్నా.. అబ్బూరి రవి  రాసిన మాటలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు.. సాయం చేసి బాధపడకూడదు’, ‘మనందరం గొప్పవాళ్లం అయిపోవాలని అనుకుంటాం.. కానీ ఎవరూ మనిషి కావడం లేదు’ లాంటి డైలాగులు ప్రేక్షకుడి మనసును తాకేలా ఉండటం విశేషం. సంగీతం ఫర్వలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనేలా ఉంది. నరేష్‌ చేసిన మరో ప్రయోగం ఈ చిత్రం. కానీ అది వర్కౌట్‌ కాకపోవడం బాధాకరం. 

నటీనటులు : అల్లరి నరేశ్ కు ఇది తప్పకుండా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. శ్రీపాద శ్రీనివాస్ పాత్రతో జీవించారు. సెటిల్ యాక్టింగ్ తో మెప్పించాడనే చెప్పాలి. ‘నాంది’ తర్వాత నరేశ్ నటించిన మరో సీరియస్ రోల్ ఇది. ఆనంది తన పాత్ర మేరకు మెప్పించింది. నటుడు, కమెడియన్ వెన్నెల కిశోర్, ప్రవీణ్ తమ పాత్రకు ఉన్న స్పేస్ లో నవ్వులు పూయించారు. సంపత్ రాజ్ కలెక్టర్ గా స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. మిగితా పాత్రల్లో నటీనటులు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

click me!