చిత్ర పరిశ్రమలో వారసత్వం అనే మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో వారసత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఎన్నార్, ఎన్టీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు లాంటి వారు అని అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ఎన్నో అద్భుతమైన కళాకండాలు లాంటి సినిమాలని ప్రేక్షకులకు ఏఎన్నార్ అందించారు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేలా కృషి చేసిన వ్యక్తుల్లో ఏఎన్నార్ కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వారి వారసత్వంలో వారి తనయులు చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు.
25
పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు
వారసత్వం గురించి ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ మీడియా పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు అని ఏఎన్నార్ అన్నారు. నేను మాత్రమే కాదు నా ఫ్యామిలిలో నాగార్జున కానీ, సుమంత్, నాగచైతన్య, సుశాంత్ ఇలా ఎవరూ పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు అని ఏఎన్నార్ అన్నారు. నాగార్జున నా కొడుకు కాబట్టి చిత్ర పరిశ్రమకి పరిచయం చేశాను. అది నా బాధ్యత.
35
తొలి సినిమా వరకే బ్యాగ్రౌండ్
ఆ తర్వాత ఆదరించాల్సింది ప్రేక్షకులే. తొలి సినిమా వరకే బ్యాగ్రౌండ్ పనిచేస్తుంది. ఇండస్ట్రీలో ట్యాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. నా కొడుకు కాబట్టి నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు లో బాగా నటించాడా ? లేదు కదా. మేమంతా ఎక్కడి నుంచి వచ్చాం. నాకు, ఎన్టీఆర్ కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు.
కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీళ్లంతా ట్యాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చారు కదా. చిరంజీవి ఎలా ఎదిగాడు ? ట్యాలెంట్ వల్లే కదా అని ఏఎన్నార్ అన్నారు. నా వరకు వస్తే నేను 4వ తరగతి కూడా చదువుకోలేదు. సంతకం సరిగ్గా పెట్టడం కూడా చేతకాదు.
55
వారసత్వం అయినా, పబ్లిసిటీ అయినా కొంతవరకే
వారసత్వం అయినా, పబ్లిసిటీ అయినా కొంతవరకే ఉపయోగపడతాయి. ఆ తర్వాత మాట్లాడాల్సింది ట్యాలెంట్ మాత్రమే అని ఏఎన్నార్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగారు. అదే విధంగా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అది తొలి చిత్రానికి మాత్రమే పరిమితం.. ఆ తర్వాత నిలదొక్కుకోవాలి అంటే ట్యాలెంట్ ఉండాలి అని ఏఎన్నార్ స్పష్టం చేశారు.