సినీ పరిశ్రమలో మొదటగా ‘ధర్మపత్ని’ అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరపై కనిపించిన ఏఎన్నార్, ఆ తర్వాత ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా మారారు. అప్పటి నుండి తన జీవిత కాలంలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు 259 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏఎన్నార్ చిత్రంతో పోస్టల్ స్టాంప్ను విడుదల చేయగా, మూడు రోజుల పాటు ఏఎన్నార్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. ఇందులో దేవదాసు, ప్రేమాభిషేకం వంటి క్లాసిక్ సినిమాలు ప్రదర్శించారు.