Janaki kalaganaledu: జెస్సిని బెదిరించిన అఖిల్.. సూసైడ్ చేసుకోవడానికి సిద్దమైన జెస్సి!

First Published Sep 15, 2022, 11:00 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 15వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మల్లికా జ్ఞానాంబ తో,ఇప్పుడు పక్కింటి ఆ పెద్దమ్మ నోరు ముగించగలిగాము కానీ ఊరందరి నోరు మూసివేయలేము కదా అత్తయ్య, దీనంతటికీ కారణం జానకి ఏ అత్తయ్యగారు. ఒక అవకాశం నీ చెరిపేయండి అని అంటుంది. జ్ఞానాంబ కోపంతో లోపలికి వెళ్తుంది. అప్పుడు జానకి రామాతో, ఈ గొడవతో నేను చదవలేక పోతున్నాను రామ గారు. పాపం అక్కడ మన వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటే నేను చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాను.
 

 ఈ సమస్య తీరితే కాని నేను చదవలేనేమో అని అంటుంది.ఈ మాటలు విన్న జ్ఞానాంబ కోపంతో, ఏం మాట్లాడుతున్నావ్ జానకి పరాయి అమ్మాయి కోసం నీ చదువుని అశ్రద్ధ చేయడమేంటి, నాకు నిన్ను చదివించడం ఇష్టం లేకపోయినా సరే కేవలం నీ వ్యక్తిత్వం చూసి నువ్వు ఇంటి బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేరుస్తామని తెలిసి నీకు చదివించడానికి అవకాశం ఇచ్చాను కానీ నువ్వు దాన్ని వృధా చేసుకుంటున్నావు. నేను నిన్ను ఇప్పుడు కాలేజ్ కి దింపుతాను వెళ్లి పరీక్ష రాయు అని అంటుంది.
 

 అప్పుడు రామ, నేను దింపుతానులే అమ్మ అని అంటాడు. ఆ తర్వాత సీన్లో గోవిందరాజు అఖిల్ దగ్గరికి వచ్చి, అఖిల్ నిజం చెప్పు నువ్వు అబద్దం చెప్పినప్పుడు అలా తడబడతావు, ఈరోజు నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. నిన్న మీ అమ్మకి మాటిచ్చినప్పుడు కూడా నీ చేతులు వణుకుతున్నాయి ఏవైనా తప్పు చేస్తే నాకు చెప్పు నేను ఏమీ అనను అని అంటాడు. అప్పుడే జ్ఞానాంబ అక్కడికి వస్తాది. జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. జ్ఞానాంబను చూసిన అఖిల్  గట్టిగా, అందరూ నన్ను ఎందుకు తప్పు చేస్తున్నాను అని అంటున్నారు.
 

నేను తప్పు చేయట్లేదు అంటే ఎవరు నమ్మరు. జెస్సీ కి నాకు నిజంగా ఏ సంబంధం లేదు అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అక్కడికి వచ్చి, మన కొడుకునే  అనుమానిస్తున్నారా ఎలాగో రెండు రోజుల్లో నిజం తెలుస్తుంది కదా. అప్పటివరకు వాడిని ఏమీ అనొద్దు.నువ్వు వెళ్లి చదువుకో అఖిల్ అని చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత  రామ,జానకి మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి, స్వీట్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అనగా పెద్దగా బెరలేవి లేవమ్మా అని అంటాడు రామా. అప్పుడు జ్ఞానాంబ,నాకు ఒకళ్ళు ఫోన్ చేసి బేరం కోసం మాట్లాడారు.
 

నువ్వు నాలుగు రోజులు వరకు కుదరదు అని చెప్పావట కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి  ఎలాగైనా స్వీట్లు కావాలి అని అడుగుతున్నారు వెళ్లి చూడు అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో జెస్సీ,తన గదిలో ఆలోచిస్తూ ఉండగా అఖిల్ ఫోన్ చేస్తాడు. అప్పుడు జెస్సి, ఏమైంది అక్కడికి అఖిల్,అక్క ఇంట్లో వాళ్ళను ఒప్పించిందా? అని అడగగా, నీకు ఏమైనా పిచ్చా నేనేం చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు అబార్షన్ చేసుకోమంటే చేసుకోకుండా మూడో మనిషిని తెచ్చి  ఇంట్లో గొడవ పెడుతున్నావు. నీకు నేను కావాలి అంటే ఇప్పుడే ఇవన్నీ మానేసి వెళ్లి అబార్షన్ చేయించుకో లేకపోతే మన పెళ్లి ఇంకెప్పటికీ జరగదు, నేను నీకు ఇంకెప్పటికీ దక్కను జాగ్రత్త అని అంటాడు.
 

అప్పుడు జెస్సీ, ఇద్దరు తప్పు చేసాము అయినా మా ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకో అఖిల్ అని అనగా మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు జెస్సీ, చదువు అయ్యేంత వరకు పెళ్లి జోలికి వెళ్ళనివ్వరు. నిజంగా నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్న ఇంకా ఈ సంగతి ఇక్కడితో వదిలెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సిన్లో జానకి పరీక్షకి వెళుతూ ఉన్నప్పుడు జెస్సీ వాళ్ల తల్లిదండ్రులు జానకికి ఫోన్ చేసి కంగారు పడతారు. జానకి వెంటనే బ్యాగ్ కింద పడేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!