లవ్ & వార్ సినిమా షూటింగ్ సమయంలో ఓ క్రూ మెంబర్ చనిపోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ప్లేస్ సేఫ్టీపై మళ్లీ చర్చ మొదలైంది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
లవ్ & వార్ సెట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఆశ్రయించింది. తప్పనిసరి భద్రతా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసి ఉంటే, క్రూ మెంబర్ చంద్రధారి సింగ్ యాదవ్ మరణాన్ని నివారించవచ్చని అసోసియేషన్ పేర్కొంది. ఈ ఘటనతో భారీ బడ్జెట్ సినిమాల్లో కార్మికుల సంక్షేమం, భద్రతా ప్రమాణాలపై చర్చ తీవ్రమైంది.
23
విషాదం తర్వాత ఆర్థిక కష్టాల్లో కుటుంబం
మరణించిన కార్మికుడు చంద్రధారి సింగ్ యాదవ్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని AICWA తెలిపింది. అతనికి భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. ఇంటికి ఆధారం అతనొక్కడే అని సమాచారం. అందుకే, బాధితుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు, పిల్లల చదువు, సంక్షేమం, భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక సహాయం అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
33
FIR, సేఫ్టీ ఆడిట్కు డిమాండ్
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాణ సంస్థ, ఇతర బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని, భద్రతా ప్రమాణాలు నిర్ధారించే వరకు షూటింగ్ నిలిపివేయాలని AICWA అధికారులను కోరింది. మహారాష్ట్రలోని అన్ని ఫిల్మ్ సెట్లలో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసింది. భన్సాలీ నిర్మాణ సంస్థల్లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాలని అసోసియేషన్ వాదిస్తోంది.