రెండు చిత్రాల కథలు ఒకటే అని కృష్ణకి తెలియడంతో ఆయన ఆ మూవీ నుంచి తప్పుకున్నారు. దీనితో చిరంజీవి, అల్లు అరవింద్ లకు లైన్ క్లియర్ అయింది. అద్భుతమైన పాటలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ తో కూడిన కథ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఫలితంగా పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి కెరీర్ లో ఖైదీ తర్వాత రెండవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఏ తెలుగు చిత్రానికి సాధ్యం కానీ విధంగా 5 కోట్ల షేర్ దగ్గర్లోకి వెళ్ళింది ఈ చిత్రం. నిర్మాతగా అల్లు అరవింద్ కి కూడా ఇదే తొలి ఇండస్ట్రీ హిట్.