Devatha: నాలుగు రోజుల్లో మీ నాయనను తీసుకొస్తాను.. దేవికి హామీ ఇచ్చిన ఆదిత్య!

First Published Aug 12, 2022, 11:42 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య, రుక్మిణి,దేవిని పట్టుకొని ఏడుస్తారూమ్ ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగమ్మా? నీ గురించి మీ అమ్మ ఎంత బాధ పడుతూ ఉంటుంది అని ఆలోచించావా?అసలు ఎందుకు పారిపోయావు? అని ఆదిత్య అనగా మా నాయన గురించి అమ్మని అడిగిన చెప్పట్లేదు. అలాగని మిమ్మల్ని వెతకమన్నా మీరు ఏమి సమాధానం ఇవ్వట్లేదు.అందుకే నేనే వెతకడానికి వెళ్తున్నాను లేకపోతే నన్ను ఏం చేయమంటారు అని అంటుంది దేవి. అప్పుడు ఆదిత్య నువ్వు ఇంకా ఎప్పుడు ఇలా బయటకి తెలియకుండా రావద్దు. అమ్మ చూడు ఎలా ఏడుస్తుందో, మీ నాయనని నేను నాలుగు రోజుల్లో ఎలాగైనా నీ ముందు నించోపెడతాను. ఇంకెప్పుడూ ఇలా చేయను అని నాకు మాట ఇవ్వు అని అంటాడు  ఆదిత్య.మా నాయనని నిజంగానే తెస్తే నేను ఎందుకు ఇలా చేస్తాను. 
 

నువ్వేం చెప్తే అదే వింటాను అని అంటుంది దేవి. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ దేవి కనబడడం లేదని ఎంతో బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. అప్పుడే రుక్మిణి,ఆదిత్య, దేవి ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్ళందరూ దేవుని పట్టుకుని ఏడ్చేస్తారు. ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్లిపోయావు? అని జానకమ్మ అడుగుతుంది.అప్పుడు ఆదిత్య, ఇప్పుడు తనని ఏమీ అనకండి.తను నాకు తన బాధ చెప్పింది.నేను దానికి పరిష్కారం కూడా ఆలోచించాను. ఇంక దీన్ని మర్చిపోండి అని అంటాడు. అప్పుడు జానకమ్మ వాళ్ళ భర్త, బాబు మీరు మొదటి నుంచి దేవిని మీ సొంత బిడ్డలా చూస్తున్నారు. రాధ తో పాటు నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఉదయం నుంచి దేవీ కోసం వెతుకుతున్నావు అని అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలు అని అంటాడు. 
 

అప్పుడు ఆదిత్య ,దేవి నా బిడ్డ అని అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మాకు పిల్లలు లేరు అని బాధపడుతున్న మా కుటుంబమంతా దేవి నీ మా సొంత బిడ్డలాగే చూస్తున్నాము అని అంటాడు ఆదిత్య. మీది చాలా పెద్ద మనసు, అందరూ ఇలా మంచిగా ఉండరు ధన్యవాదాలు మీ మేలు మేము మర్చిపోలేము అని జానికమ్మ ఆదిత్యతో అంటుంది. మాధవ్ లోపల కుళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జానకమ్మ దేవితో,నీకేం తక్కువ చేసాం అమ్మ, ఇంట్లో నుంచి వెళ్లిపోయావు అని అనగా మాధవ్, దేవితో నేను మాట్లాడతాను మీరందరూ వెళ్లండి అని అంటాడు. ఈలోగా జానకమ్మ వాళ్ళు దేవికి తినడానికి తయారు చేయడానికి వంట గదిలోకి వెళ్తారు. మాధవ్ దేవి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నట్లు నటిస్తూ, నాన్నకి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు అమ్మ అని బాధపడతాడు. అప్పుడు ఆదిత్య, రాధ ,తన బాధ నాకు చెప్పింది. ఇంకెవరు తన్నేం అడగాల్సిన అవసరం లేదు తీసుకెళ్ళి తనకి భోజనం పెట్టండి అని వాళ్ళిద్దర్నీ పంపించేస్తాడు.
 

అప్పుడు ఆదిత్య, మాధవ్ తో ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే దేవి ఇక్కడికి నుంచి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడైనా ఇలా జరిగిందంటే మాత్రం నిన్ను క్షమించలేను. నీ కూతురు కోసం నా కూతుర్ని బాధపడడం మంచిది కాదు. అని ఆదిత్యా అంటాడు.అప్పుడు మాధవ్ నా ఇంట్లోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు.అయినా అది నీ కూతురు అని నీకు నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలీదు అని అంటాడు. నువ్వు ఇంతకు మించి ఇంకేది చేసినా నీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో ఆదిత్య,వాళ్ళ ఇంట్లో బయట కూర్చుని దేవి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాకూడదు. నా తండ్రి మంచోడు కాదు అని నాకే చెప్తుంది. కాదమ్మా అని చెప్పలేని పరిస్థితి నీ బాధ పడతాడు. 
 

ఆ తర్వాత సీన్లో దేవి తన గదిలో కూర్చుని ఉంటుంది. రుక్మిణి, దేవికి అన్నం తినిపించాలని అక్కడికి వెళుతుంది కానీ దేవి మాత్రం నాకు ఏమీ తినాలని లేదు. ఆఫీసర్ సర్ మా నాయనను నా కళ్ళ ముందు పెట్టే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని అంటుంది దేవి. రుక్మిణి బలవంతంగా తినిపించబోయే సరికి ఆ ప్లేట్ ని కింద పడేస్తుంది.ఈ లోగా భాగ్యమ్మ అక్కడికి వచ్చి అలా చేయకూడదమ్మ ఎదుటి వాళ్ళు నిన్ను చూసి నీకు ఇంత కోపము అని తప్పుగా అనుకుంటారు.అమ్మ చెప్పిన మాట వినాలి అని అంటుంది.అప్పుడు దేవి అనుకుంటే అనుకోని నాకెందుకు? నాకు నా నాయన దొరికే వరకు నేను తినను అని అంటుంది దేవి. ఇటువైపు ఆదిత్య మాధవ్ గురించి ఆలోచిస్తూ,నా అధికారంతో తలుచుకుంటే నిన్ను లాకర్లో వేయగలను. కేవలం నా బిడ్డ బాధపడుతుందని తెలిసే నిన్ను వదిలేస్తున్నాను అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!!

click me!