‘బ్రహ్మాస్త్ర’ టీమ్ కు షాక్.. షారుఖ్ ఖాన్ పవర్ ఫుల్ రోల్ లీక్.!

First Published Aug 12, 2022, 11:17 AM IST

భారీ ఫాంటాసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). ఈ సినిమా తెలుగులోనూ ‘బ్రహ్మాస్త్రం’ గా రిలీజ్ కానుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా లీక్ ల పర్వం మొదలైంది.

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఫాంటసీ ఫిల్మ్ `బ్రహ్మాస్త్ర` (Brahmastra). బాలీవుడ్ లవ్ బాయ్ రన్బీర్ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తర్వలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  మూవీ నుంచి అందుతున్న అప్డేట్స్ కూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.  
 

అయితే తాజాగా చిత్రం నుంచి లీక్ పర్వం మొదలైంది. ఇప్పటి వరకు చాలా జాగ్రత్తలు పాటించి చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. మూవీలో ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ‘బ్రహ్మస్త్ర’లో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని పవర్ ఫుల్  పోటోలు ఇంటర్నెట్ లో లీకయ్యాయి. 

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ వానర అస్త్ర అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. భారీ విజువల్స్ తో కింగ్ ఖాన్ అదిరిపోయే లుక్ ను ప్రదర్శించాడు. మేకర్స్ షారుఖ్ (Shah Rukh Khan) పాత్రతో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇంతలోనే ఇంటర్నెట్ లో లీకవడం యూనిట్ కు షాకింగ్ గా ఉంది. అయితే షారుఖ్ ఖాన్ కామియో అపియరెన్స్ పక్కా అంటూ గట్టి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షారుఖ్ సంబంధించిన  ఫొటోలు, వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

మరికొద్ది రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలోకి వచ్చాకా షారుఖ్  పాత్రపై మరింత క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు ‘బ్రహ్మస్త్ర’ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్,  ట్రైలర్ లో ఎక్కడా షారుఖ్ మాత్రం కనిపించలేదు. దీంతో షారుఖ్ ఫొటోలు లీకవడంతో ఆడియెన్స్ కూడా ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇప్పటికే షారుక్ ‘లాల్ సింగ్ చడ్డా’లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. 

అదేవిధంగా బాలీవుడ్ బాయ్ ఝాన్ నటిస్తున్న ‘టైగర్ 3’లోనూ స్పెషల్ అపియరెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక షారుఖ్  ప్రస్తుతం ‘పఠాన్’,‘జవాన్’, ‘డుంకీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘బ్రహ్మస్త్ర’ చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. మూడు భాగాలుగా రాబోతున్న చిత్రం నుంచి ప్రస్తుతం మొదటి భాగాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. 
 

ఇప్పటికే వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. మరోవైపు ప్రచార కార్యక్రమాలనూ జోరుగానే కొనసాగిస్తున్నారు. అదీగాక చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తుండగా.. మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. 

click me!