నాతో తక్కువగా మాట్లాడే కృష్ణ వచ్చి బతిమాలినా ఒప్పుకోలేదు..కొడుక్కి విషం పెట్టాలి అని చెప్పగానే..

First Published Jun 26, 2024, 7:15 PM IST

ఇండస్ట్రీలో తన నటనని చాలా మంది మెచ్చుకున్నట్లు వాణిశ్రీ తెలిపింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్ మాత్రం తనని ఎపుడూ మెచ్చుకోలేదని వాణిశ్రీ అన్నారు. ఎందుకు అని ప్రశ్నించగా వాళ్ళ సమస్య ఏంటో నాకు తెలియదు. కృష్ణ అయితే నాతో మాట్లాడడమే చాలా తక్కువ అని వాణి శ్రీ తెలిపింది. 

కళాభినేత్రిగా, నటనలో లెజెండ్ గా ప్రశంసలు దక్కించుకున్న వాణిశ్రీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ.. గడుసరిగా నటించడం వాణిశ్రీకే చెల్లింది. వాణిశ్రీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలందరితో నటించింది. అదే విధంగా ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో తల్లి, అత్త తరహా పాత్రలు చేసింది. 

అయితే ఇండస్ట్రీలో తన నటనని చాలా మంది మెచ్చుకున్నట్లు వాణిశ్రీ తెలిపింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్ మాత్రం తనని ఎపుడూ మెచ్చుకోలేదని వాణిశ్రీ అన్నారు. ఎందుకు అని ప్రశ్నించగా వాళ్ళ సమస్య ఏంటో నాకు తెలియదు. కృష్ణ అయితే నాతో మాట్లాడడమే చాలా తక్కువ అని వాణి శ్రీ తెలిపింది. 

Latest Videos


సెట్స్ లో ఉన్నప్పుడు కూడా కృష్ణ నాతో సరిగ్గా మాట్లాడరు అని వాణిశ్రీ పేర్కొంది. అలాంటి కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు బతిమాలినట్లు వాణిశ్రీ పేర్కొంది. విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయిగారు చిత్రాన్ని ముందుగా కృష్ణ చేయాలనుకున్నారట. వెంకటేష్ బొబ్బొలి రాజా చిత్రంలో నేను నటించాను. 

స్టార్ హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత అత్త పాత్రల్లో నటించడం నాకేమి ఇబ్బందిగా అనిపించలేదు అని తెలిపింది. అబ్బాయిగారు చిత్రం రీమేక్ మూవీ. ముందు కృష్ణ గారి దగ్గరికి ఆ చిత్రం వెళ్ళింది. కృష్ణ కి తల్లిగా వాణిశ్రీ నటిస్తే తాము నిర్మించటానికి ఒకే అని నిర్మాతలు అన్నారట. 

దీనితో కృష్ణ నాకు ఫోన్ చేశారు. వాణిశ్రీ ఈ సినిమా నువ్వు చేయాలి అని బతిమాలారు. ఆ కథపై కృష్ణకి అంత నమ్మకం ఉండేది. అది రీమేక్ సినిమా.. పైగా తల్లి పాత్ర. దీనితో నేను వెంటనే ఒప్పుకోకుండా.. ఆ మూవీ చూసి నా నిర్ణయం చెబుతా అని వాణిశ్రీ అన్నారట. తమిళంలో ఆ చిత్రం చూస్తే క్లైమాక్స్ లో తల్లే తన కొడుక్కి విషం పెట్టే సీన్లు ఉంటాయి. 

నేను వెంటనే ఈ మూవీ నేను చేయను అని చెప్పేసినట్లు వాణిశ్రీ అన్నారు. పెంచిన బిడ్డకే విషం పెట్టడం తనకి ఏమాత్రం నచ్చలేదని వాణిశ్రీ తెలిపింది. వాణిశ్రీ ఒప్పుకోకపోవడంతో ఆ చిత్రం కృష్ణ చేతుల్లో నుంచి వెంకటేష్ వద్దకు వెళ్ళింది. ఇక తల్లి పాత్రలో జయచిత్ర నటించారు. అదే విధంగా నచ్చకపోయినా కొన్ని చిత్రాలు చేశానని వాణిశ్రీ అన్నారు. బొంబాయి ప్రియుడు, వింతకథ లాంటి చిత్రాలు తనకి నచ్చలేదని తెలిపారు. 

click me!