తమిళంలో త్రిష- విజయ్ జంటగా.. 2004లో గిల్లి, 2005లో తిరుపాచి, 2006లో ఆతి, 2008లో కురువి వచ్చాయి. మళ్లీ 14 ఏండ్ల తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో విజయ్, త్రిషతో పాటు.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తోంది. ఇక విజయ్తో త్రిషకు ఇది ఐదవ సినిమా కావడం విశేషం.