కాగా తాజాగా మరో పురాతన ఆలయాన్ని దర్శించుకుంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన దోమకొండ కోటలోని మహాదేవుని ఆలయంలో ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రియాంక.. తర్వాత అక్కడున్న అద్దాల మేడను, రాణీమహల్ను సందర్శించారు.
అక్కడున్నఇతర కట్టడాలను సైతం పరిశీలించింది. దోమకొండ లాంటి చిన్న ఊరుకు ప్రియాంక చోప్రా రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఆలయానికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కోట కామినేని వంశీయులకు చెందింది. నిజాం నవాబులకు, అంతకు ముందు కాకతీయ రాజులకు సామంతులుగా ఉంటూ కామినేని కుటుంబం దోమకొండ సంస్థానాన్ని పాలించే వారు. కోట చుట్టూ సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో రాతి కట్టడంతో కూడిన ప్రహరీగోడను నిర్మించారు. ఈ కోటకు రామ్ చరణ్కు సంబంధం ఉందని మీకు తెలుసా.?