సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతుంది నటి నయనతార. సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి నయనతార.. సౌత్ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించింది. ఆమెకు ప్రస్తుతం విఘ్నేష్తో వివాహమై సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
27
ఆమెకు ప్రస్తుతం విఘ్నేష్తో వివాహమై సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నయనతార ఇప్పటి వరకూ 75 సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇంకా అరడజను సినిమాలవరకూ ఉన్నాయి. భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది నయన్. పెళ్లి తర్వాత కూడా ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.
అంతే కాదు గతేడాది ఆమె బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుక్ ఖాన్ సరసన పఠాన్ సినిమాలో నటించి సంచలనంగా మారారు. ఈసినిమా సూపర్ సక్సెస్ తో బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. అయితే నయనతారకు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అదేంటంటే..? గతంలో ఆమె చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో నయనతార ఉంటున్న టైమ్ లో జరిగిన ఘటనను ప్రముఖ నిర్మాత అనంతనన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆఅపార్ట్మెంట్ లో గతంలో నయనతార తనన ఫ్యామిలీతో కలిసి నివసించారు. అయితే అక్కడ ఉన్నంత కాలం నయనతార అక్కడ ఏదో ఒక రకంగా హడావిడి చేస్తూనే ఉండేవారట.
ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెట్టి విసిగిపోయినట్లుగా చేశారట. అంతే కాదు నయనతార రాత్రిపూట ఎక్కువ హాడావిడి చేసి నిద్రలేకుండా చేశేవారట. నటి నయనతార తరచుగా అర్ధరాత్రి నిద్రలేచి, ఫోన్లో అరుస్తూ.. గోల చేస్తూ.. చుట్టు ఉన్నవారిని ఇబ్బందిపెట్టేవారట. ఆటో డ్రైవర్లతో, డెలివరీ బాయ్స్ తో.. ఇలా అందరితో ఆమె అర్ధరాత్రి గొడవపడేదని అన్నారు.
అర్థరాత్రి గొడవ పడి కేకలు వేయడం లాంటిది. ఒకటి కాదు రెండు కాదు ఇలా చెబుతూ ఉంటే నయనతార వల్ల అపార్ట్ మెంట్ లో చాలా ఇబ్బందులు రావడంతో ఇవి తట్టుకోలేక అపార్ట్మెంట్ యజమాని నటిని ఖాళీ చేయమని కోరినట్లు. అదే కారణంతో నయనతార అపార్ట్మెంట్ను ఖాళీ చేసిందని ఆయన అంటున్నారు.అయితే ఈ విషయాల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
77
Nayanthara Looks Gorgeous In Saree As She Shares New Photos
ఇక ప్రస్తుతం కోట్లకు అధిపతి అయిన ఆమె.. లగ్జరీ ఇళ్లు.. సొంత ప్లైట్.. విలాసవంతమైన కార్లతో లైఫ్ ను హ్యాపీగా గడుపుతోంది. కాని ఆమెపే నిర్మాతల సంఘానికి 50కి పైగా ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.