నటి నవ్య నాయర్ మల్లెపూల వల్ల చిక్కుల్లో పడ్డారు. కేవలం 15 సెంటీమీటర్ల జాజిపూల దండ వల్ల ఆస్ట్రేలియాలో లక్షా 14 వేల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. లేదంటే జైలు శిక్ష పడేది. ఇది వింతగా అనిపించినా నిజం. ఓణం పండుగ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన నవ్య నాయర్కి ఈ జరిమానా విధించారు. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పుకున్నారు.
25
కోచి విమానాశ్రయంలో తండ్రి ఇచ్చిన జాజిపూలు
ఓణం పండుగ కోసం నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కి వెళ్లారు. విక్టోరియాలోని మలయాళీ సంఘం ఓణం వేడుకలకు ఆమెను ఆహ్వానించింది. కోచి నుండి ఆస్ట్రేలియాకి విమానంలో బయలుదేరే ముందు, నవ్య తండ్రి ఆమెకు జాజిపూలు ఇచ్చారు. ఓణం పండుగకు జాజిపూలు ముఖ్యమని చెప్పారు.
35
మల్లెపూలని హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్న నటి
తండ్రి చెప్పినట్టు ఓణం వేడుకల్లో మల్లెపూలు పెట్టుకోవాలని నవ్య అనుకుంది. కోచి నుండి ఆస్ట్రేలియాకి నేరుగా విమానం లేదు. సింగపూర్లో విమానం మారాలి. అందుకని మల్లెపూలని రెండు ముక్కలు చేసి, ఒకటి తలలో పెట్టుకుని, మరొకటి హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుంది. ఆస్ట్రేలియాలో కార్యక్రమానికి వెళ్లే ముందు మరో ముక్క పెట్టుకోవాలనుకుంది.
సింగపూర్లో విమానం మారి మెల్బోర్న్ చేరుకున్న నవ్యకు కస్టమ్స్ అధికారులు, పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె బ్యాగ్లో 15 సెంటీమీటర్ల జాజిపూలు దొరికాయి. ఆస్ట్రేలియా నియమాల ప్రకారం, విదేశాల నుండి వచ్చేవారు ఎలాంటి పూలు, మొక్కలు తీసుకురావాలన్నా ముందే చెప్పాలి. నవ్య ఈ విషయం చెప్పలేదు. అందుకే పోలీసులు జరిమానా విధించారు.
55
అక్కడకి వాటిని అనుమతించరు
నియమం ఉల్లంఘిస్తే 6,600 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు లక్షా 14 వేల రూపాయలు) జరిమానా కట్టాలి. 28 రోజుల్లోపు జరిమానా కట్టాలని చెప్పారు. లేదంటే జైలు శిక్ష పడుతుంది. నియమం గురించి తెలియక జరిమానా కట్టానని, ఇది తనకు ఒక పాఠమని నవ్య చెప్పుకుంది.తాను తీసుకు వెళ్లిన మల్లెపూలు ఇంత కాస్ట్లీ అని తనకు తెలియదు అని నవ్య ఓ కార్యక్రమంలో చమత్కరించింది. మెల్బోర్న్ విమానాశ్రయంలో బయో సెక్యూరిటీ ఉంది. వివిధ రకాల తెగుళ్లు వ్యాపించే పండ్లు, మొక్కలు, పూలు తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం