మన తెలుగమ్మాయి అయిన లయ `భద్రంకొడుకో` చిత్రంతో 1992లో బాలనటిగా కెరీర్ని ప్రారంభించింది. వేణు తొట్టెంపూడి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. `మా బాలాజీ`, `మనోహరం`, `మనసున్న మహారాజు`, `కోదండ రాముడు`, `రామ్మ చిలకమ్మా`, `హనుమాన్ జంక్షన్`, `ప్రేమించు`, `మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `కొండవీటి సింహాసనం`, `శివరామరాజు`, `నీ ప్రేమకై`, `నువ్వు లేక నేను లేను`, `దొంగరాముడు అండ్ పార్టీ`, `మిస్సమ్మ`, `టాటా బీర్లా మధ్యలో లైలా`, `విజయేంద్రవర్మ`, `గజేంద్ర` వంటి సినిమాలు చేసింది. `బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం`(2010) సినిమాలో చివరగా మెరిసింది.