అప్పట్లో లేడి కమెడియన్ గా రాణించిన వారిలో శ్రీలక్ష్మి, కృష్ణవేణి లాంటి నటీమణుల పేర్లు ప్రధానంగా వినిపించేవి. తన మొదటి పెళ్లి పెటాకులు కావడంతో చంకలో బిడ్డని వేసుకుని ఇండస్ట్రీకి వచ్చానని కృష్ణవేణి అన్నారు. ఇండస్ట్రీలో అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో వారాలబ్బాయి, శ్రీమతిగారు, ముగ్గురు మిత్రులు చిత్ర దర్శకుడు రాజాచంద్రతో పరిచయం ఏర్పడినట్లు కృష్ణవేణి తెలిపారు.