తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆమె నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1989 నుంచి మొన్నటి వరకు సినిమాల్లో యాక్టివ్ గానే కనిపించారు. ఎప్పుడూ మీడియాలో ఆమె దర్శనమిస్తూనే ఉంటారు.
టాలీవుడ్ లో 250కి పైగా సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో ఆమెది సుధీర్ఘ ప్రయాణమనే చెప్పాలి. సపోర్టింగ్ రోల్స్ తో పాటు కామెడీ పండించడంలోనూ హేమ దిట్టా అని పలు చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
ఆ మధ్యలో తరుచుగా మీడియాలోనే కనిపించే హేమ కొద్దినెలలుగా దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల కింద కిర్రాక్ ఆర్పీ కర్రీ పాయింట్ ఓపెనింగ్ సమయంలో కనిపించారు. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హేమ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ.. ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె వందల కోట్లు ఆస్తులు కూటబెట్టింది? అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆమె సంపాదనపై ప్రస్తుతం ఎలా ఉందో చెప్పుకొచ్చారు.
వందల కోట్లు ఆస్తులు కూడబెట్టారనేది అవాస్తవం అన్నారు. తనకు ఆ రేంజ్ లో ఆస్తులు లేవని క్లారిటీ ఇచ్చారు. కానీ తన కూతురుని సెటిల్ చేసే వరకైతే సంపాదించినట్టు తెలిపారు. ఇప్పటికీ తను సంపాదిస్తున్నానని చెప్పారు. అవకాశాల కోసం చూస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
ఇక అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసిన హేమ రెండేళ్లుగా పెద్దగా సినిమాలేవీ చేసినట్టు కనిపించలేదు. ప్రస్తుతం ‘శ్రావ్య’ అనే చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందంట. ఈ మూవీ నుంచి స్పష్టమైన అప్డేట్స్ లేవు. ఇదిలా ఉంటే... హేమ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని తన పాత్రకు నంది అవార్డును సొంతం చేసుకుంది.