ఒక అడవి పందిని చంపి మోహన్ బాబు సిబ్బంది కర్రకు కట్టి తరలిస్తున్నారు. వారిలో మేనేజర్ కిరణ్ తో పాటు ఎలక్ట్రిషియన్ దుర్గా ప్రసాద్ ఉన్నారట. ముగ్గురు వ్యక్తులు అడవి పందిని తరలిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. దీనిపై జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణులకు హానీ చేస్తున్న వారిని ఉపేక్షించకండి, వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.