ఇక నువ్వు షూటింగ్ కు రాకు.. నయనతారపై సీరియస్ అయిన దర్శకుడెవరో తెలుసా.. ?

First Published Jun 1, 2023, 9:19 PM IST

ఎంతటిస్టార్టు అయినా.. ఏదో ఒక టైమ్ లో అవమానాలు పడాల్సిందే.  పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న స్టార్స్ అంతా.. ఒకప్పుడు ఇలా అవమానాలు పడినవారే..? ఈక్రమంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కు సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

Nayanthara

ఏజ్ పెరుగుతున్నా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు నయనతారకు. ఎంతో కష్టపడి సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది నయన్. అయితే నయన్ సెబ్రిటీ కాకముందు చాలా స్ట్రగుల్స్ చూసిందట. ఎంతో మందితో మాటలుపడిందట.  ఓ డైరెక్టర్ అయితే ఆమెను పై విసుక్కుంటూ.. అసలు షూటింగ్ కు రాకు అని అనేశాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు.. ఎందుకు అలా అన్నాడు..? 

Nayanthara

తెలుగులో స్టార్ సీనియర్ హీరోలు, యంగ్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది నయనతార.  చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరోలతో నటించింది. అటు  తమిళంలో కూడా రజనీకాంత్, అజిత్, విజయ్, లాంటి స్టార్స్ సరసన మెరిసింది.  అప్పట్లో నయనతార అంటే హీరోలందరికి లక్కీ అని చెప్పాలి.  ఇప్పుడు కూడా ఆమెతో సినిమా  అంటే మేకర్స్ పరుగులు పెడుతుంటారు. 
 

నయనతార అంటేఓ బ్రాండ్.. ప్రస్తుతం ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఆమె. ఏజ్ బార్ అవుతున్నా.. నయన్ డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతుంది బ్యూటీ. పెళ్లై పిల్లలున్నా ఆమె ఇమేజ్ కు వచ్చిన డోకా ఏమీ లేదు.

నయనతార సినిమా ప్రమోషన్లకు రాదు. అయినా కూడా ఆమెతో సినిమా అంటే వరుస కడుతుంటారు మేకర్స్. ఎంతో మందిని నమ్మి మోసపోయిన ఈ బ్యూటీ. తాజాగా తనను అర్ధం చేసుకున్న యంగ్ డైరెక్టర్.. తనకంటే చిన్నవాడు అయినా.. విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే ఆమెతన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులుఫేస్ చేసింది. ముఖ్యంగా అవమానాలు ఎన్నో పడింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయన తారపై డైరెక్టర్ పార్టిబన్ ఓ సారి సీరియస్ అయ్యారట. అది కూడా ఓ షూటింగ్ సందర్భంగా. 

ఈ విషయాన్ని పార్తీబన్ స్వయంగా వెల్లడించారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన  పార్తీబన్ తెరకెక్కించాల్సిన కుడైకుళ్ మజై సినిమాకు ముందుగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారట. అయతే సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పగా రాకపోగా.. సాయంత్ర 8 గంటలకు కాల్ చేస్తే.. నిన్న రాత్రి బయలు దేరలేదండీ.. ఈ రోజు రాత్రి బయలు దేరి వస్తానని చెప్పిందట. దాంతో దర్శకుడికి కోపం కట్టలు తెంచుకుందట. 

దాంతో ర్రెత్తుకొచ్చిన  పార్తీబన్‌... దీంతో కోపంతో ఇక నువ్వు రావొద్దు అని చెప్పాడట. ఈ విషయాన్ని  పార్తీబన్ స్వయంగా చెప్పారు. అయితే అప్పుడు నయనతార షూటింగ్స్ కోసం బస్సుల్లోనే తిరిగేదట. అంత హోదా లేని టైమ్ నుంచి.. ప్రస్తుంతం స్టార్ గా ఎదిగింది బ్యూటీ.  ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదగడం పట్ల పార్థిబన్ సంతోషం  వ్యక్తం చేశారు. అంతే కాదు  పనిపట్ల ఆమెకున్న నిబద్దతను చూసి.. ముచ్చటేస్తుందంటున్నారు దర్శకుడు. 

click me!