Guppedantha Manasu: కొడుకుని చూసి ఎమోషనలవుతున్న జగతి దంపతులు.. రిషిని చూసి షాకైన శైలేంద్ర!

Published : Jul 12, 2023, 07:30 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కొడుకుని చూసి ఎమోషనల్ అవుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: కొడుకుని చూసి ఎమోషనలవుతున్న జగతి దంపతులు.. రిషిని చూసి షాకైన శైలేంద్ర!

 ఎపిసోడ్ ప్రారంభంలో ప్రిన్సిపల్ వచ్చి గెస్ట్ లు వచ్చేస్తున్నారు సార్ రండి రిసీవ్ చేసుకుందాం అని విశ్వనాథం, రిషి వాళ్ళతో చెప్తాడు. నా మాటలు విన్న వసుధార కుర్చీలోంచి లెగుస్తుంది. అప్పుడు రిషి వచ్చి మీరేమీ రావక్కర్లేదు అటు ఇటు నడిస్తే మళ్ళీ మీ కాలు నొప్పి ఎక్కువ అవుతుంది ఎలాగో వాళ్ళు ఇక్కడికే వస్తారు కదా అప్పుడు పరిచయం చేసుకుందురు గాని అని వసుతో చెప్తాడు. ప్రిన్సిపల్ కూడా అలాగే చెప్పడంతో ఆగిపోతుంది వసుధార.
 

28

ఏంజెల్ వసుకి తోడుగా ఉంటాను అని చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ రిసీవింగ్ కోసం బయటికి వెళ్తారు. దూరం నుంచి చూస్తున్న శైలేంద్ర టోపీ పెట్టిన వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది అనుకుంటాడు. మహేంద్ర వాళ్ళు వచ్చి కారు దిగుతారు. మహేంద్ర వాళ్ళు రిషి ని చూసి ఎమోషనల్ అవుతారు. తల్లిదండ్రులను చూసి షాక్ అవుతాడు. ఎమోషనల్ ఆపుకోలేక కొడుకుని వెళ్లి హత్తుకున్నట్లుగా.. నన్ను అమ్మా అని పిలవవా..నన్ను క్షమించవా.. అంటూ కొడుకుతో మాట్లాడుతున్నట్లుగా బ్రమ పడుతుంది జగతి.
 

38

ఆలోచన లో ఉన్న జగతిని అందరూ వెయిట్ చేస్తున్నారు రా అని మహేంద్ర చెప్పటంతో భ్రమ నుంచి బయటికి వస్తుంది. ప్రిన్సిపల్ తనని తాను పరిచయం చేసుకొని అక్కడున్న అందరినీ పరిచయం చేస్తాడు. ఈయన రిషి సార్ అని రిషిని చూపించడంతో ఇంతకుముందు తెలియనట్లుగా ఇద్దరూ రిషిని విష్ చేస్తారు. షాక్ లో ఉన్న రిషి ని పక్కన ప్రిన్సిపల్ పిలవటంతో షాక్ నుంచి బయటకు వచ్చి జగతికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తాడు. ప్రిన్సిపల్ రిషి పేరు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు శైలేంద్ర.
 

48

 ఇందుకేనా పిన్ని వాళ్ళు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అయినా వీడు బ్రతికుండడం ఏంటి అనుకుంటూ టెన్షన్ పడతాడు. జగతి దంపతులని స్టాప్ అందరు లోపలికి తీసుకువెళ్తారు రిషి మాత్రం బయటకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వసుని  చూసి జగతి  జగతిని చూసి వసు షాక్ అవుతారు. మహేంద్ర దంపతులకి వసుధారని పరిచయం చేస్తాడు ప్రిన్సిపల్.  కాలేజీలో పాటలు చెప్పే లెక్చరర్లు ఉన్నారు కానీ పిల్లల భవిష్యత్తుని బాగు చేసే లెక్చరర్లు లేరు అనుకుంటున్నా సమయంలో వచ్చారు ఈ మేడమ్.
 

58

ఈవిడ వల్లే రిషి సార్ కూడా కాలేజీకి వస్తున్నారు అంటూ వసు గురించి గొప్పగా చెప్తారు ప్రిన్సిపల్ మరియు విశ్వనాథం. తర్వాత సెమినార్ కి టైం అవుతున్నా రిషి రాకపోవడంతో తీసుకురావడానికి పాండ్యన్ వెళ్తాడు. అదే సమయంలో రిషి బయట కూర్చుని ఇప్పుడు ఏం చేయటం లోపలికి వెళ్ళి సెమినార్ చెప్పనా లేకపోతే బయటే ఉండిపోను అని ఆలోచనలో పడతాడు అయినా వాళ్ళు ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా లేకపోతే ప్లాన్డ్ గా వచ్చారా అని అనుకుంటాడు.
 

68

 మళ్లీ తనని తానే మోటివేట్ చేసుకుని ఇది పిల్లల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దీనిని మిస్ అవ్వకూడదు. అయినా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే నే కదా మనసు రాటు దేలుతుంది అనుకుంటాడు. మరోవైపు సైలేంద్ర రిషి ని పట్టి పట్టి చూస్తాడు. వాడు కన్ఫామ్ గా రిషి అయినా ఎలా బ్రతికున్నాడు ఇదేం ట్విస్ట్ అని టెన్షన్ పడతాడు. రిషి ని చంపమన్న వాళ్ళకి ఫోన్ చేసి నేను చంపమన్న వ్యక్తిని చంపకుండా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు వాడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు శైలేంద్ర.
 

78

 అలాంటిదేమీ లేదు సార్ మేము అటాచ్ చేసామంటే తిరుగు ఉండదు. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు మీకు ఇప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు  ఆ వ్యక్తి. కాసేపటి తర్వాత ఫోన్ చేసి అతను చనిపోలేదంట సార్ ఎక్కడో పొరపాటు జరిగింది. వాడు మృత్యుంజయుడు అనుకుంటాను అంటాడు కిల్లర్. నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయండి నేను వేరే వాళ్ళతో మాట్లాడుకొని  వాడిని లేపించేస్తాను అంటాడు శైలేంద్ర.
 

88

ఏంటి సార్ చాలా మాట్లాడుతారు అదేదో మేమే లేపేస్తాము అంతేగాని డబ్బులు అడగకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కిల్లర్. ఎవరూ లేనప్పుడే వాడిని మీరు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు వాడి చుట్టూ అందరూ ఉన్నారు ఇప్పుడు మీరు వాడిని ఏమి చేయలేరు అనుకుంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories