ఆగస్టు 8న శోభిత ధూళిపాళ్ల-నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన వేణు స్వామి.. వారిద్దరూ మూడేళ్ళ లోపే విడిపోతారు. జాతకాల ప్రకారం కలిసి జీవించే అవకాశం లేదు. నాగ చైతన్యకు సహజంగా పిల్లలు కూడా పుట్టరు, అన్నాడు. వేణు స్వామి కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.
మంచు విష్ణు తనకు ఫోన్ చేశాడని, ఇకపై సెలెబ్స్ జాతకాలూ చెప్పనంటూ అనంతరం వేణు స్వామి వీడియో వదిలాడు. గతంలో కూడా ఇదే మాట చెప్పిన వేణు స్వామి అది తప్పాడు. మరోవైపు వేణు స్వామి జాతకాలను, పూజలను నమ్మే టాలీవుడ్ సెలెబ్స్ ఉన్నారు. రష్మిక మందాన ఆయన భక్తురాలు కావడం విశేషం.