హైదరాబాద్ వన్డే: ఆసిస్ రెండేళ్ల నిరీక్షణ vs టీమిండియా ప్రతీకారం

First Published Mar 1, 2019, 4:37 PM IST

భారత్-ఆస్ట్రేలియా  జట్లు మధ్య రసవత్తర పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. రెండు టీ20ల సీరిస్ గెలిచి జోష్ లో ఆసిస్... స్వదేశంలో టీ20 సీరిస్ కోల్పోయిన పరాభవంతో టీమిండియా హైదరాబాద్ లో అడుగుపెట్టాయి. దీంతో ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  శనివారం జరగనున్న ఆరంభ మ్యాచ్ ను ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్ ను గెలిచి వన్డే సీరిస్ లో శుభారంభం చేయాలని   భావిస్తున్నాయి. 
 

భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య రసవత్తర పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. రెండు టీ20ల సీరిస్ గెలిచి జోష్ లో ఆసిస్... స్వదేశంలో టీ20 సీరిస్ కోల్పోయిన పరాభవంతో టీమిండియా హైదరాబాద్ లో అడుగుపెట్టాయి. దీంతో ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం జరగనున్న ఆరంభ మ్యాచ్ ను ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్ ను గెలిచి వన్డే సీరిస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. దీంతో ఇప్పటికే బెంగళూరు నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఇరుజట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్ లో ముమ్మరంగా శ్రమిస్తున్నారు.
undefined
అయితే ఆస్ట్రేలియా జట్టు గత రెండేళ్లుగా ఒక్క వన్డే సీరిస్ కూడా గెలవలేదు.వన్డే ప్రపంచ కప్ కు ముందు ఇలా చెత్తఆటతీరుతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఆసిస్ జట్టు భారత్ తో జరిగే వన్డే సీరిస్ గెలవాలన్న పట్టుదలతో వుంది. ఈ గెలుపు ఫామ్ లోకి వచ్చి ఇంగ్లాండ్ లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో విశ్వాసంతో అడుగుపెట్టాలని ఆసిస్ భావిస్తోంది.
undefined
ఇక ఇప్పటికే స్వదేశంలో టీ20 సీరిస్ కోల్పోయిన భారత శిబిరంలో నిరుత్సాహం ఆవరించింది. ఇప్పటివరకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను వారి దేశంలోనే ఓడించి గెలుపు జోష్ తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఎంతో ఉత్సాహంతో ఆరంభించిన టీ20 సీరిస్‌‌ ఆసిస్ వశమవడంతో భారత శిబిరంలో జోష్ తగ్గింది. మళ్లీ వన్డే సీరిస్ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచ కప్ లో అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. అందుకోసమే హైదరాబాద్ వన్డే కోసం కీలక ఆటగాళ్లు సాధనలో మునిగిపోయారు.
undefined
విశాఖలో జరిగిన మొదటి టీ20లో పేలవ ఆటతీరు కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ రెండో టీ20 కి దూరమయ్యాడు. అయితే హైదరాబాద్ వన్డేలో మాత్రం బ్యాటింగ్ తో రాణించి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. అందుకోసం రోహిత్ ఉప్పల్ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు.
undefined
ఇక బెంగళూరులో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించినా లాభం లేకుండా పోయింది. అయితే భారత్ కు ఓటమి ఎదురైనప్పటికి కోహ్లీ బ్యాటింగ్ తో ఆకట్టుకోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.. ఇదే జోరును వన్డే సీరిస్ లో కూడా అదే జోష్ కొనసాగించాలన్న పట్టుదలతో కోహ్లీ నెట్స్ లో ముమ్మరంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
undefined
టీమిండియాలో మరో కీలక ఆటగాడు ఎంఎస్. ధోని కూడా రెండో టీ20లో అదరగొట్టి మంచి పామ్ ను అందుకున్నారు. అదే ఫామ్ ను కొనసాగించడానికి ధోని ఉప్పల్ స్టేడియంలో ఇతర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టిస్ చేస్తున్నాడు.
undefined
మొదటి వన్డే కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేధార్ జాదవ్,ఎంఎస్.ధోని, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా,మహ్మద్ షమీ, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్. వీరిలో తుది జట్టులో ఎవరికి స్థానం లభిస్తుందో మరికొద్దిసేపట్లో బిసిసిఐ ప్రకటించనుంది.
undefined
click me!