తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ అర్ష్దీప్ పై మండిపడ్డాడు. మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందిస్తూ...‘ఏడు నోబాల్స్. ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక ఓవర్ కంటే ఎక్కువ. అంటే ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 21 ఓవర్లు వేసినట్టు. క్రికెట్ లో ప్రతీ బౌలర్, బ్యాటర్ కు చేదు అనుభవాలుంటాయి. బౌలర్లు చెత్త బంతులు వేస్తారు. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటారు.