వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ లో తాము పాల్గొనబోమని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో చర్చకు లేవదీశాయి. జై షా వ్యాఖ్యలకు పాక్ కౌంటర్ ఇవ్వడం, ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.