టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఇదివరకే యూకేకు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఆదివారం ఛతేశ్వర్ పుజారా కూడా టీమిండియాతో కలిశాడు. పుజారా అక్కడే కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్న విషయం విదితమే.