ఐపీఎల్ ముగిశాక ప్రస్తుతం అందరి దృష్టీ ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ మీద పడింది. జూన్ 7 నుంచి 11 దాకా ది ఓవల్ లో జరుగబోయే ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ కంటే వికెట్ కీపర్ గా ఎవరిని ఆడిస్తే బాగుంటుందని జోరుగా చర్చ సాగుతున్నది. భారత జట్టు ఈ మ్యాచ్ కు కెఎస్ భరత్ తో పాటు ఇషాన్ కిషన్ లను ఎంపిక చేసింది.