WTC లో రెండోసారి ఫైనల్కు చేరిన ఆసీస్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, పెర్త్లో జరిగిన మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసింది. అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలలో భారత్కు బిగ్ షాకిస్తూ అద్భుత విజయాలు అందుకుంది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకుంది. ఇక భారత జట్టు తొలిసారిగా WTC ఫైనల్ ఆడలేకపోతోంది. భారత్ చివరి రెండు ఫైనల్స్కు చేరుకుంది, అయితే రెండుసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ 2021లో భారత్ను ఓడించగా, 2023లో ఆస్ట్రేలియా భారత్ను ఓడించింది. ఈ సారైనా WTC టైటిల్ సాధించాలనే భారత్ కల చెదిరిపోయింది.