రోహిత్ శర్మ గాయం తీవ్రత ఏ స్థాయిలో వుందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేపట్టినట్లు సమాచారం. ఒకవేళ అతడి గాయం పెద్దదిగా తేలితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలున్నాయి. అయితే రోహిత్ గాయంపై ఇటు టీమిండియా మేనేజ్ మెంట్ గానీ, బిసిసిఐ వర్గాలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కు ముందు ఆటగాళ్ళ జాబితా విడుదలతో రోహిత్ గాయం క్లారిటీ రానుంది. ఒకవేళ ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు రోహిత్ దూరమైతే కెప్టెన్సీ బాధ్యత కెఎల్ రాహుల్ కు చేపట్టనున్నారు.