నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు ముందు ఒక రంజీ మ్యాచ్ ఆడిన జడ్డూ.. తొలి టెస్టులో సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో జడ్డూ.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్, అక్షర్ లు వికెట్లు తీయడానికి తంటాలు పడుతున్న చోట అతడు మెరిశాడు. స్మిత్, లబూషేన్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేసి ఆ జట్టును 177 పరుగులకే పరిమితం చేశాడు.