అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అత్యధికంగా రూ. 1,289 కోట్ల తో గౌతం అదానీ (అదానీ స్పోర్ట్స్ లైన్) దక్కించుకున్నాడు. ముంబైని ముఖేష్ అంబానీ (ఇండియా విన్ స్పోర్ట్స్- రూ. 912 కోట్లు), బెంగళూరును ఆర్సీబీ - రూ. 901 కోట్లు, లక్నోను కాప్రి గ్లోబల్ రూ. 757 కోట్లు.. ఢిల్లీని (జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ లు సంయుక్తంగా) రూ. 810 కోట్లతో దక్కించుకున్నాయి. వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు జట్టు కూర్పులపై దృష్టిసారించాయి. వేలంలో ఎవరిని దక్కించుకోవాలి..? టీమ్ బ్యాలెన్స్డ్ గా ఉండేందుకు ఏం చేయాలి..? అన్న అంశాలపై ఆయా ఫ్రాంచైజీలకు చెందిన క్రికెట్ పండితులు చర్చోపచర్చలు సాగిస్తున్నారు.