SBI: ధోనికి రూ.6 కోట్లు, అభిషేక్ బచ్చన్‌కు నెలకు రూ.18.9 లక్షలు ఎస్‌బీఐ ఎందుకు ఇస్తోంది?

Published : Jun 15, 2025, 11:11 PM IST

SBI: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఏడాదికి రూ.6 కోట్లు, అభిషేక్ బచ్చన్‌కు నెలకు రూ.18.9 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెల్లిస్తోంది. ఎందుకు వీళ్లకు ఇంత భారీ మొత్తాన్ని ఎస్‌బీఐ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఎస్‌బీఐ నుంచి ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు నెలకు రూ.18.9 లక్షలు

State Bank of India: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి సంవత్సరానికి రూ.6 కోట్లు ఇస్తోంది. అలాగే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు నెలకు రూ.18.9 లక్షలు చెల్లిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

25
ఎస్‌బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ నియామకం

2023 అక్టోబరులో ఎస్‌బీఐ ధోనిని అధికారికంగా తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. బ్యాంక్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అక్టోబర్ 28, 2023న పోస్ట్ చేస్తూ, ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా ఈ వివరాలు పంచుకున్నారు.

అందులో "ధోనీ సంతృప్తికరమైన కస్టమర్‌గా ఉన్నందున, ఆయనను బ్రాండ్ రాయబారిగా ఎంపిక చేయడం మా బ్యాంక్ విలువలకు అనుగుణంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశం, కస్టమర్ల పట్ల నిబద్ధతను మరింత బలపరచాలనే లక్ష్యంతో ఉన్నాం" అని పేర్కొన్నారు.

ధోనీ ప్రకటనల్లో పాల్గొనడం ద్వారా బ్యాంక్ తన మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొంది.

35
బ్యాంక్‌కు అభిషేక్ బచ్చన్ జుహూ బంగ్లా అద్దె

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కు కూడా ఎస్బీఐ నెలకు లక్షల్లో డబ్బును ఇస్తోంది. దీనికి కారణం అభిషేక్ తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో  కలిసి ముంబై జుహూలో ఉన్న వత్సా, అమ్ము అనే రెండు బంగ్లాల గ్రౌండ్ ఫ్లోర్‌లను ఎస్‌బీఐకి అద్దెకు ఇచ్చారు. ఈ అద్దె ఒప్పందం 2021 సెప్టెంబర్ 28న నమోదైంది. ఒప్పందం ప్రకారం:

• ప్రారంభంగా నెలకు అద్దె రూ.18.9 లక్షలు

• 5 సంవత్సరాల తర్వాత ఇది రూ.23.6 లక్షలకు పెరుగుతుంది

• 10 సంవత్సరాల తర్వాత రూ.29.5 లక్షలు అవుతుంది

• మొత్తం లీజ్ వ్యవధి 15 సంవత్సరాలు

45
ధోనీ ఆదాయంలో బ్రాండ్ ప్రకటనలు కీలకం

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా, ధోనీ బ్రాండ్ ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తూ, దేశంలో అత్యధికంగా సంపాదించే క్రీడాకారుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఆయన వాణిజ్య ప్రకటనలలో ఎస్‌బీఐ ప్రధాన భాగస్వామిగా నిలిచింది.

55
ఎస్‌బీఐ వ్యాపార వ్యూహంలో సెలబ్రిటీల పాత్ర

ధోనీ వంటి ప్రముఖ క్రీడాకారుల సమ్మిళనంతో, ఎస్‌బీఐ తన మార్కెట్ బ్రాండ్‌ను బలోపేతం చేస్తోంది. అదే విధంగా, ప్రధాన నగరాల్లో స్థలాన్ని అద్దెకు తీసుకొని, సేవలను విస్తరించడంలో అభిషేక్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు కూడా పరోక్షంగా భాగస్వాములవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories