ఐపీఎల్ ముగిశాక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. అక్కడ ఓ టెస్టుతో పాటు వన్డేలు, టీ20లలో దారుణంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్ లలో 76 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ కథ ముగిసినట్టేనని, ఇక రిటైర్ అవడమే మంచిదన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి. మళ్లీ పాత కోహ్లీని చూడటం కలే అని చాలా మంది విమర్శలు కూడా చేశారు.