పదే పదే విఫలమవుతుండటంతో అతడిని ఆడించొద్దని, తుది జట్టులో అతడిని చేర్చడం అంటే అది భారత్ లో బ్యాటర్లు లేరని ఒప్పుకోవడమే అంటూ టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్న వెంకటేశ్ ప్రసాద్.. అతడిని ప్రతీసారి ఆడిస్తున్నందుకు టీమ్ మేనేజ్మెంట్ పైనా విమర్శలు గుప్పించాడు.