మ్యాచ్ ముగిసిన తర్వాత మాథ్యూ హెడన్, అలెన్ బోర్డర్ లు కూడా ఆసీస్ ఆటను తప్పుబట్టారు. జడేజా ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని గమనించకుండా ప్రతీసారి స్వీప్ షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారని, స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ పై ఇంత చెత్త ఆట ఆడి పరువు తీసుకున్నారని దుయ్యబట్టారు. జడ్డూ తెలివిగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను భారత్ వైపునకు తిప్పాడని వ్యాఖ్యానించారు.