జాఫర్ మాట్లాడుతూ...‘ఫిబ్రవరిలో టీమిండియాకు కీలకమైన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ (రోహిత్, కోహ్లీ) రంజీలు ఆడాలి. ఇటీవల కాలంలో వీళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడినంతగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. దీంతో వాళ్లకు కచ్చితంగా మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. రంజీలలో అది కావాల్సినంత దొరుకుతుంది..