ఈ టూర్ లో భారత్.. నవంబర్ 18న తొలి టీ20, 20, 22న మిగిలిన మ్యాచ్ లు ఆడుతుంది. ఇక నవంబర్ 25న తొలి వన్డే.. 27, 30న తదుపరి వన్డేలు ఆడుతుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ కు రానుంది. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్ టూర్ కు గైర్హాజరీ అవుతున్న కోహ్లీ, రోహిత్, రాహుల్ లు బంగ్లాదేశ్ టూర్ కు తిరిగివస్తారు.