మయాంక్ ను పక్కనబెడితే ఛతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ‘పుజారా గతంలో కూడా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అతడు, గిల్ ఓపెనర్లుగా వస్తే.. రహానేను వన్ డౌన్ లో పంపాలి. తర్వాత కోహ్లీ, అయ్యర్ లు రావాలి..’ అని చెప్పాడు. అయితే తుది నిర్ణయం కెప్టెన్, కోచ్ ల మీదే ఆధారపడి ఉందని లక్ష్మణ్ తెలిపాడు.