టీ20 వరల్డ్‌కప్ 2021కి భారత జట్టును ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా...

First Published Jul 28, 2021, 5:43 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌కి ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్నదే. ఈ టీ20 సిరీస్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు ఆడే భారత జట్టు సభ్యులు, నేరుగా టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటారు...

అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో ఎవరుంటే బాగుంటుందో చెబుతూ క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ జట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా కూడా చేరారు...
undefined
ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంచుకున్న వీరూ, నెహ్రా... వన్‌డౌన్‌లో కెఎల్ రాహుల్‌ను ఎంచుకున్నారు.
undefined
శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న శిఖర్ ధావన్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించలేదు. అతనితో పాటు ఇషాన్ కిషన్‌కి కూడా అవకాశం ఇవ్వలేదు...
undefined
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టీ20 వరల్డ్‌కప్‌కి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు.
undefined
ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 వరల్డ్‌కప్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నారు సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా...
undefined
సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కినా, భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కి టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం ఇవ్వలేదు.
undefined
ఈ మధ్య పెద్దగా ఫామ్‌లో లేక, తెగ ఇబ్బంది పడుతున్నా.. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం ఇచ్చారు.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.
undefined
వాషింగ్టన్ సుందర్‌‌‌కి స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించారు వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా... టీ20ల్లో పెద్దగా రికార్డు లేని సుందర్‌కి పొట్టి వరల్డ్‌కప్‌లో చోటు కల్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
భువనేశ్వర్ కుమార్, శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో భువీకి చోటు కల్పించారు వీరూ, నెహ్రా...
undefined
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి టీ20 వరల్డ్‌కప్‌లో ప్రధాన పేసర్‌గా చోటు కల్పించారు వీరూ, నెహ్రా.
undefined
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి కూడా భారత టీ20 వరల్డ్‌కప్‌లో చోటు కల్పించారు సెహ్వాగ్, నెహ్రా.
undefined
యూఏఈలో జరిగే మెగా టోర్నీ కావడంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చారు ఈ మాజీ క్రికెటర్లు..
undefined
వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా ప్రకటించిన టీ20 వరల్డ్‌కప్ జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్
undefined
click me!