రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ.. జట్టులో వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఆటగాళ్ల అభిమానులు మాత్రం నిత్యం ఏదో విషయమ్మీద చర్చకు దిగుతూనే ఉంటారు. తాజాగా ఈ చర్చలోని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా మారిన ఆకాశ్ చోప్రా కూడా చేరాడు. రోహిత్-కోహ్లీల కెప్టెన్సీపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.