ఎల్‌పీయూపై విరాట్ కోహ్లీ ప్రమోషనల్ పోస్ట్... చర్యలకు సిద్ధమైన కౌన్సిల్...

First Published Jul 28, 2021, 6:43 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో కలిపి 220 మిలియన్లకు పైగా ఫాలోవర్లు విరాట్ కోహ్లీ సొంతం. ఒక్కో పోస్టుకి రూ.5 కోట్లు తీసుకునే విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు, అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.

భారత సారథి విరాట్ కోహ్లీ, పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ప్రమోట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశాడు...
undefined
‘వాట్ ఏ రికార్డ్. భారత ఒలింపికన్లలో 10 శాతం మంది లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్లే... ఎల్‌పీయూ, భారత క్రికెట్ జట్టులోకి కూడా స్టూడెంట్స్‌ను పంపుతుందని ఆశిస్తున్నా.... జై హింద్’ అంటూ ఎల్‌పీయూ యూనివర్సిటీని ట్యాగ్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
అంతేకాకుండా ‘ఎల్‌పీయూ స్టూడెంట్స్ ఇన్ ఒలింపిక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా కోట్ చేశాడు. దేశానికి ఇలాంటి మరో 10 యూనివర్సిటీలు కావాలంటూ... ‘ఇండియా నీడ్ 10 ఎల్‌పీయూస్’ అంటూ కొటేషన్‌ను జత చేశాడు...
undefined
అయితే ప్రకటనలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో అడ్వటైజింగ్ స్టాండట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) కొన్ని నియమాలను అమలులోకి తెచ్చింది.
undefined
ఈ నియమాల ప్రకారం ప్రమోషన్స్ కోసం చేసే పోస్టుల్లో ‘అడ్వటైజింగ్’ అని రాయాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ చేసిన పోస్టులో ఇలాంటివేమీ లేవు. అంతేకాకుండా ఎల్‌పీయూ, విరాట్ చేసిన ట్వీట్‌ను ప్రకటనల్లో కనిపించేలా వేసి, పత్రికల్లో ప్రచురించింది.
undefined
ఇలా తన పోస్టు ద్వారా జనాలను, ఫాలోవర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఏఎస్‌సీఐ...
undefined
నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషనల్ పోస్టు చేసిన విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించేందుకు పావులు కదుపుతున్న అడ్వటైజింగ్ స్టాండట్స్ కౌన్సిల్, భారత సారథికి నోటీసులు కూడా పంపినట్టు సమాచారం...
undefined
click me!