రోహిత్ శర్మ, విరాట్ మధ్య మాటల్లేవా... కోహ్లీ స్టేట్‌మెంట్ వెనక అర్థమేంటి?...

First Published Nov 29, 2020, 9:51 AM IST

2020 మిస్టరీ ఇయర్‌లాగే రోహిత్ శర్మ గాయం కూడా ఓ అంతుచిక్కని సమస్యగా మారింది. తాను ఫిట్‌గా ఉన్నానంటూ రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడేశాడు, బీసీసీఐ మాత్రం రోహిత్ ఫిట్‌గా అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని ఆలస్యం చేస్తోంది. ఈ గొడవ నడుస్తుండగానే రోహిత్ శర్మ గాయం గురించి తనకు తెలియదని, అతను ఎందుకు ఆస్ట్రేలియా రాలేదో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చెప్పడం అనేక చర్చలకు తావిస్తోంది.

గత దశాబ్ద కాలంలో టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. విరాట్ అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుంటే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు రోహిత్ శర్మ.
undefined
అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఏడాదిన్నరగా వినిపిస్తున్న వార్త. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓటమికి కారణం ఇదేనని కూడా టాక్ వినిపించింది.
undefined
భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని, ఆటగాళ్ల అభిప్రాయాలకి ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
undefined
అయితే తమ మధ్య ఎలాంటి మనస్ఫర్థలు, గొడవలు లేవని చాలాసార్లు చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ మాత్రం ఇలాంటి వార్తలపై ఎనాడూ స్పందించలేదు.
undefined
తాజాగా రోహిత్ గాయం ఓ మిస్టరీలా మారిందని, అతను ఆస్ట్రేలియా ఎందుకు రాలేదో తెలియడం లేదని విరాట్ కోహ్లీ మీడియాతో చెప్పాడు. రోహత్ శర్మ గాయం గురించి, అతను ఆస్ట్రేలియాకి వచ్చేది, రానిదీ సమాచారం లేదని విరాట్ చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
undefined
మ్యాచులు లేని సందర్భాల్లో కూడా కెఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహాల్ వంటి చాలామంది ప్లేయర్లతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు భారత సారథి విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ కూడా అంతే.
undefined
అలాంటిది రోహిత్ శర్మ గాయం గురించి తెలియదనడం చూస్తుంటే, ఈ ఇద్దరి మధ్య మాటలు లేనట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. ‘ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాకుండా స్వదేశానికి వెళ్లాడు రోహిత్ శర్మ. అతను ఎందుకు ఆస్ట్రేలియా రాలేదో అర్థం కావడం లేదు’ అన్నాడు విరాట్ కోహ్లీ.
undefined
రోహిత్ శర్మ భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా రావడం లేదనే విషయం కూడా విరాట్ కోహ్లీకి తెలియలేదంటే ఈ ఇద్దరి మధ్య ఎంతటి అగాథం నెలకొందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
undefined
రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మకి కరోనా సోకడంతో ఆస్ట్రేలియా వెళ్లకుండా స్వదేశానికి వచ్చాడని తెలిపింది బీసీసీఐ. గురునాథ్ ఆరోగ్యం కాస్త కోలుకోవడంతో రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడని వివరించింది.
undefined
ముంబై ఇండియన్స్ ఐదోసారి టైటిల్ గెలవడంతో రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు.
undefined
కెప్టెన్సీ వస్తే వదులుకోనని, భారత జట్టును నడిపించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారని రెండేళ్ల క్రితమే కామెంట్ చేశాడు రోహిత్ శర్మ. ముంబై కాకుండా వేరే జట్టుకి కెప్టెన్ అయి ఉంటే రోహిత్ ఇన్ని ఐపీఎల్ టైటిల్స్ గెలిచేవాడా? అనే ప్రశ్నకి కూడా ఘాటైన సమాధానం ఇచ్చాడు రోహిత్.
undefined
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య వైరం తారాస్థాయికి చేరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి స్టార్లు ఉన్న జట్టును నడిపించిన మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
అయితే గంగూలీ కూడా విరాట్‌కి మద్ధతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. గాయం కోలుకోవడానికి సమయం పడుతుందని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా తిరిగి ఐపీఎల్ ఆడిన రోహిత్ శర్మపై గంగూలీ అండ్ కో గుర్రుగా ఉన్నారని టాక్.
undefined
టీమిండియాకు ఆడడం కంటే ముంబై ఇండియన్స్‌లో తన స్థానం కాపాడుకోవడానికే రోహిత్ శర్మ ప్రాధాన్యం ఇచ్చాడని, అందుకే ఫిజియో మాటలకు కూడా లెక్కచేయకుండా ఐపీఎల్ ఆడాడని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
మరి ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల మధ్య నెలకొన్న వైరం భారత జట్టుకు ఇప్పటికే చాలా నష్టం చేకూర్చింది. ఇప్పటికే బీసీసీఐ ఈ ఇద్దరి మధ్య విభేదాలకు పరిష్కారం కనుక్కుంటే బెటర్ అంటున్నారు క్రికెట్ అభిమానులు.
undefined
click me!