కోహ్లీ టీ20 ఫార్మాట వదిలేయాలని, టెస్టులు, వన్డేల మీద దృష్టి సారించాలని అక్తర్ సూచించాడు. టీ20లలో ఆటగాళ్ల ఎనర్జీ బాగా వేస్ట్ అవుతుందని, అది క్రికెటర్ల కెరీర్ మీద ప్రభావం చూపుతుందని అక్తర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మరో 20 సెంచరీలు చేయాలంటే టీ20ల నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిదని అన్నాడు.