వన్డే సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సెప్టెంబర్లో ఆసియా కప్ 2023 టోర్నీలోనే ఆడబోతున్నారు. అంటే మరో నెల రోజులకు పైగా రెస్ట్ దక్కనుంది. ఇలాంటి సమయంలో వన్డే సిరీస్లో మూడు మ్యాచుల్లోనూ ఈ ఇద్దరినీ ఆడించాల్సింది పోయి, ప్రయోగాలు, రెస్ట్ పేరుతో తప్పించడం వెనక లాజిక్ ఏముందో అర్థం కావడం లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..