పూజారా కాదు, అసలైన జిడ్డు బ్యాటింగ్ కోహ్లీదే... ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ క్లాస్ ఇన్నింగ్స్...

First Published Jun 20, 2021, 5:55 PM IST

టీమిండియాలో ప్రస్తుత తరంలో జిడ్డు బ్యాటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఛతేశ్వర్ పూజారా. అయితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, పూజారాకి మించిన జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించాడు...

తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే చూడచక్కని కవర్ డ్రైవ్ ఆడుతూ ఖాతా తెరిచాడు విరాట్ కోహ్లీ... అంతే ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కటంటే ఒక్కబౌండరీ కూడా బాదలేదు...
undefined
132 బంతుల్లో 1 ఫోర్‌తో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కోహ్లీ స్ట్రైయిక్ రేటు 33.33 మాత్రమే...
undefined
సాధారణంగా వన్డేల్లో 88+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసే విరాట్ కోహ్లీ టెస్టుల్లో అయితే 50-60 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తాడు.
undefined
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్నామనే ప్రెషర్ తీసుకున్న కోహ్లీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నం చేయలేదు... కోహ్లీ కంటే ఫైనల్‌లో పూజారా, బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు చేయడం విశేషం.
undefined
35 బంతుల తర్వాత బౌండరీ ద్వారా ఖాతా తెరిచిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత రెండో బంతికే మరో బౌండరీ బాదాడు.... కోహ్లీ మాత్రం తన ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బౌండరీ బాదాడు...
undefined
విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో సెంచరీ లేకుండానే 13 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్నాడు. 2011-12 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, మళ్లీ 2020-21లో 13 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు...
undefined
ప్లేయర్‌గా ఐదో ఐసీసీ ఫైనల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, కేవలం ఒకే ఒక్క సారి హాఫ్ సెంచరీ చేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 35 పరుగులు చేసిన కోహ్లీ... 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 43 పరుగులు చేశాడు.
undefined
2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 77 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు కోహ్లీ...
undefined
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి...
undefined
click me!